IND vs BAN : రెండో ఇన్నింగ్స్లో ది వాల్ ఛతేశ్వర్ పూజారా శతకం సాధించాడు. చాలా రోజులుగా భారీ ఇన్నింగ్స్ కోసం ఎదరుచూస్తున్న అతను సెంచరీ దాహాం తీర్చుకున్నాడు. పూజారా సెంచరీ చేసిన వెంటనే కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. దాంతో 512 రన్స్ ఆధిక్యంలో నిలిచి మ్యాచ్పై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీకి చేరువగా వచ్చి 90 రన్స్కు అవుట్ అయ్యాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్లో అతను ఆ పొరపాటు చేయలేదు. ఓపెనర్ శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత దూకుడు పెంచాడు. బంగ్లా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత మూడో ఓవర్లోనే పూజారా సెంచరీ మార్క్కు చేరువయ్యాడు. 130 బంతుల్లోనే 14 ఫోర్లతో వ్యక్తిగతంగా వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ అతనికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే 52 ఇన్సింగ్స్ల సుదీర్ఘ కాలం తర్వాత అతను శతకం చేశాడు. అతను చివరగా 2019 జనవరి 3న ఆస్ట్రేలియా మీద సెంచరీ చేశాడు.
ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి పూజారా 102, కోహ్లీ 19 రన్స్తో నాటౌట్గా నిలిచారు. ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో 110 స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 23 పరుగులకే వెనుదిరిగి మరోసారి నిరాశ పరిచాడు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్, ఖలెద్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.