అమరావతి : మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనైనా మార్పు సాధ్యమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల వీర మహిళల శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నట్లుగానే రాజకీయంలో కూడా ప్రవేశించి తమ సత్తాను చాటుకోవాలని సూచించారు.
ఏపీ అమరావతి రాజధాని కోసం మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత 928 రోజులుగా రాజధాని మహిళలు శాంతియుతంగా లక్ష్యం కోసం చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.