ఎంపీ సంతోష్కుమార్, వట ఫౌండేషన్ సహకారం
పాలమూరు కేసీఆర్ అర్బన్ పార్కులో ఏర్పాటు
చెట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ / హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్తో కలిసి మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని 5 పెద్ద వృక్షాలను ఆదివారం ట్రాన్స్లొకేషన్ ద్వారా కేసీఆర్ అర్బన్ పార్కులో నాటించారు. ఆర్అండ్బీ అతిథి గృహం స్థలంలో అధునాతన వెజ్, నాన్వెజ్ మారెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో అకడ ఉన్న వందల ఏండ్ల వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. దీంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యవేక్షణలో ఆ వృక్షాలను భారీ క్రేన్ల సాయంతో ట్రాన్స్లొకేట్ చేశారు. వాటిలో మూడు పెద్ద వేపచెట్లు, కొండమల్లె, వెలగపండ్ల చెట్లు ఉన్నాయి.
చెట్ల తొలగింపు ప్రక్రియను నాలుగు రోజుల ముందు నుంచే ప్రారంభించారు. నలుగురు నిపుణుల పర్యవేక్షణలో పది మంది కూలీలు పని పూర్తి చేశారు. చెట్ల చుట్టూ 5 ఫీట్ల లోతు తవ్వి మట్టిని తొలగించి, క్రేన్ సాయంతో చెట్టును లారీలోకి ఎక్కించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసీఆర్ అర్బన్ పార్కుకు తరలించినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సహకారం అందించిన ఎంపీ సంతోష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వృక్షాల ట్రాన్స్లొకేషన్లో పాలుపంచుకొన్న కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ప్రజారోగ్య ఈఈ విజయభాస్కర్, ఇతర ఇంజినీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు.