బిజినేపల్లి : కేంద్ర జల శక్తి అభియాన్ కింద బిజినేపల్లి మండలంలో (Bijinepally mandal) చేపట్టిన పనులను కేంద్ర నోడల్ అధికారి ఆత్వర పవర్ బృందం ( Central team ) పరిశీలించింది . లింగసానిపల్లి, నంది వడ్డేమాన్ గ్రామాల్లో 2023-24 సంవత్సరంలో చేపట్టి పూర్తిచేసిన పనులను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లింగసానిపల్లి గ్రామంలో చేపట్టిన కమ్యూనిటీ సోప్ పిట్ సందర్శించి సోప్ పిట్ వల్ల గ్రామస్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత నంది వడ్డేమాన్లో సూరయ్య కుంటాను సందర్శించి కుంట నుండి తీసిన మట్టి రైతులుకు ఉపయోగపడిందా లేదా అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ సోప్ పిట్ భూగర్భ జలాలు పెరుగుతాయని, కుంటలో నల్ల మట్టి వల్ల భూములు సారవంతం అవుతాయని వారు వివరించారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అడిషనల్ డీఆర్డీవో రాజేశ్వరి, రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, పవన్, మండల అభివృద్ధి అధికారి కతాలప్ప, ఏపీవో మల్లికార్జున్, ఈసీ రామ్మోహన్, సాంకేతిక సహాయకులు రాజు, రమేష్, కార్యదర్శి లింగారెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ నాగేంద్రం, దేవదాసు, రైతులు పాల్గొన్నారు.