కొండపాక (కుకునూరుపల్లి), ఏప్రిల్ 16: సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన బుద్ది అఖిల్యాదవ్ సివిల్స్ ఫలితాల్లో 321వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యాడు. ఈయన 2021లో తొలి ప్రయత్నంలోనే 566 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యాడు. ఐపీఎస్ శిక్షణ పొం ది ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేరవుతూ ఇప్పుడు 321వ ర్యాంకుతో సత్తాచాటాడు. ‘చిన్నప్పటి నుంచి కన్న కలను సాకారం చేసుకున్న.
నా విజయానికి, నన్ను లక్ష్యం వైపు నడిపించిన నా తల్లిదండ్రులకు, గురువులకు రుణపడి ఉంటా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నన్ను చదివించడానికి అమ్మానాన్న వెనుకం జ వేయలేదు. నేను చదువుకోవడంలో ఇబ్బందులు పడకుండా నా తమ్ముడు నాపై చూపిన ప్రేమను మరువలేను. ఆత్మైస్థెర్యంతో చదివాను. నేటి యువకులు పట్టుబడితే ఏదైనా సాధించే సత్తా ఉన్నది. ఉన్నత లక్ష్యంతో బరిలోకి దిగితే విజయం సాధించడం ఖాయం’ అని అఖిల్యాదవ్ తెలిపారు.