సిటీబ్యూరో, డిసెంబర్ 22 ( నమస్తే తెలంగాణ): అర్హత గల ఎగ్జిక్యూటివ్స్కి బీఈపీపీఈఆర్ఆర్-2017 ద్వారా పదోన్నతి కల్పించడంతో పాటు జేటీవో, ఎస్డీఈలకి ఈ2, ఈ3 పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు బుధవారం ఆదర్శ్నగర్లోని బీఎస్ఎన్ఎల్ భవన్ ఎదుట సామూహిక ధర్నా నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28న రిలే నిరవధిక దీక్ష, జనవరి 3న సామూహిక ఉద్యోగుల సెలవు తదితర కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు.
మెనేజ్మెంట్ ట్రైనీ, డైరెక్ట్ రిక్రూట్ డీజీఎంల నియామకాలు నిలిపివేయాలని కోరారు. ప్రమోషన్ల కాలపరిమితిని పెంచి స్టాగ్నేషన్ సమస్యని సృష్టించే రిస్ట్రక్చర్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కమిటీల రిపోర్టులు బీఎస్ఎన్ఎల్ నష్టానికి ఉద్యోగుల వైపే వేలెత్తి చూపాయన్నారు. మేనేజ్మెంట్పై పోరాటంలో ప్రతీ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎన్ఈఏ సర్కిల్ సెక్రటరీ సురేశ్, అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ రంగనాథ్, ఏఐజీఈటీఓఏ సర్కిల్ సెక్రటరీ వీరభద్రారావు పాల్గొన్నారు.