మన్సూరాబాద్(హైదరాబాద్ ) : మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి(BRS candidate) రాగిడి లక్ష్మారెడ్డి (Lakshmareddy) ని భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి అండగా నిలువాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (MLA Sudeer Reddy) కోరారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థితో కలసి మన్సూరాబాద్, మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో మార్నింగ్ వాక్ నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాకర్స్తో ఆయన మాట్లాడుతూ పార్కులో అదనపు యోగా షెడ్డుతో పాటు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రధాన సమస్యలను పరిష్కరించానని వెల్లడించారు. ఆనంద్నగర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మింపజేసి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతానని హామీ ఇచ్చారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని పేర్కొన్నారు.
రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. అనంతరం ఇంద్రప్రస్తకాలనీలో వారు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎల్బీనగర్ నియోజకర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్గౌడ్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్గౌడ్ పాల్గొన్నారు.,