హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ కాంస్య పతకంతో ఆకట్టుకుంది. టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన తెలంగాణ ఆసాంతం స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగించింది. శనివారం జరిగిన సెమీస్లో తెలంగాణ 9-16 తేడాతో హిమాచల్ప్రదేశ్ చేతిలో పోరాడి ఓడింది. తొలి అర్ధభాగంలో 3-11తో వెనుకబడిన మన అమ్మాయిలు..కీలకమైన ద్వితీయార్ధంలో పుంజుకునే ప్రయత్నం చేశారు. ఆఖర్లో గట్టి పోటీనిచ్చినా.. విజయం వైపు నిలువలేకపోయింది. మరో సెమీస్లో రైల్వేస్ 24-22తో హర్యానాపై అద్భుత విజయం సాధించింది. ఆదివారం హిమాచల్ప్రదేశ్, రైల్వేస్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్కు క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత హాజరవుతారని జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు.