మహేశ్వరం: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక మన బోనాల పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మతల్లిని దేవస్థాన చైర్మన్ రెడ్డిగళ్లరత్నంతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన సూర్యగిరిఎల్లమ్మ తల్లి చలువతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. భక్తుల కొంగుబంగారం గా పిలువబడే ఎల్లమ్మతల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బోనాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు.గత ఏడాది కరోన కారణంగా బోనాల పండుగను జరుపుకోలేక పోయామని ఆమె అన్నారు. ఈఏడాడి పెద్ద ఎత్తున పండుగలను జరుపుకునే విదంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని అన్నారు.
కరోనా నుండి తెలంగాణ ప్రజలను విముక్తి కల్గించాలని ఆమె ప్రార్ధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లను చేసిన ఆలయకమిటి సిబ్బందిని, ఇతర అధికారులను మంత్రి అభినందించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ సిబ్బంది ఇతర అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో అఖండ స్వాగతం పలికారు. ఈకార్యకమంలో మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానివెంకట్రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.