ముంబై: వచ్చే మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో మార్పులు జరుగనున్నాయని, ఆ మార్పును మార్చిలోగా చూస్తారని తెలిపారు. ‘బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ చీలిక, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు రహస్యంగా ఉండాలి. బహిరంగంగా ఇప్పుడే చెప్పబోం’ అని రాణే వెల్లడించారు.