న్యూఢిల్లీ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Polls) పోటీ చేసే 58 మంది అభ్యర్ధులతో కూడిన మూడవ జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. మాజీ ఎమ్మెల్యే అజత్ సింగ్ మెహతా కాంగ్రెస్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే సచిన్ పైలట్లో తలపడనున్నారు. ఇక దౌసా నియోజకవర్గం నుంచి బీజేపీ మరోసారి శంకర్ లాల్ శర్మను బరిలో దింపింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మురళీ లాల్ మీనాపై శర్మ 48,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక అంతకుముందు 83 మంది అభ్యర్ధులతో బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది. మాజీ సీఎం వసుంధర రాజె జలర్పటన్ నుంచి సీనియర్ నేత రాజేంద్ర రాథోడ్ను తారానగర్ నుంచి బరిలో నిలిపింది. ఎంపీలు రాజ్యవర్ధన్ రాధోడ్, దియా కుమారిలను కూడా అసెంబ్లీ బరిలో నిలిపింది.
రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అందంలం ఎక్కాలని కాషాయ పార్టీ కసరత్తు సాగిస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్దానాలు గెలుచుకోగా బీజేపీ 73 స్ధానాలకు పరిమితమైంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టింది. ఇక నవంబర్ 25న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :