హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో కలిసి మహేష్ బిగాల హైదరాబాద్లో బర్త్డే వేడుకలు పండుగలా నిర్వహించారు. ఎన్నారైలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తూ.. పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నాగరాజు గుర్రాల, నరేందర్ రెడ్డి మేడసాని, రవీందర్ రెడ్డి, మధుసూదన్ వర్మ, సంపత్ చారి, మాధవ్ కటికనేని, అమ్రిత్ ముళ్ళపూడి, రవి కుమార్ బట్టు , పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.