చర్లపల్లి, డిసెంబర్ 8: పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం బయోఫ్యూయల్ను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెనోవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జానయ్య అన్నారు. ఐవోసీ, హెచ్పీసీఎల్, గెయిల్ ఇండియా, బీపీసీఎల్ తదితర చమురు సంస్థల ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలోని ఎన్ఎస్ఐసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన బయోఫ్యూయల్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్కు బదులు బయో ఫ్యూయల్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం బయో ఫ్యూయల్పై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్పీసీఎల్ సీజీఎం సీకే.నర్సింహాచారి, ఐఓసీ జీఎం కె.హరిబాలసుబ్రమణ్యం, గెయిల్ ఇండియా జీఎం శరత్కుమార్, బీపీసీఎల్ సీఆర్ఎం శ్రీనివాస్, హెచ్పీసీఎల్ సీఆర్ఎం ఎతేంద్రపాల్సింగ్, డీజీఎం హెచ్ఎల్ఆర్ఓ అభిత్ ఖాద్రీ, ఎన్ఎస్ఐసీ మేనేజర్ ప్రభురాజు పాల్గొన్నారు.