Bhairan Singh : 1971 యుద్ధ వీరుడు భైరాన్ సింగ్ ఇకలేరు. 81 ఏళ్ల వయసున్న ఆయన ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఆరోగ్య సమ్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు జోధ్పూర్లోని ఎయిమ్స్లో చేర్పించారు. ఆరోగ్యం కుదటపడకపోవడంతో భైరాన్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. బంగ్లాదేశ్ వియోచనం కోసం భారత్ – పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భైరాన్ సింగ్ పాల్గొన్నారు. రాజస్థాన్లోని లాంగేవాలా చెక్పోస్ట్ వద్ద పాక్ బలగాలను నిలువరించడంలో ఆయన అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అందుకు గుర్తింపుగా 1972లో సేనా మెడల్ అందుకున్నారు. ఆయన కథతో బాలీవుడ్లో బార్డర్ అనే సినిమా వచ్చింది. అందులో సునీల్ శెట్టి హీరోగా నటించాడు.
సరిహద్దు సేవాదళంలో సేవలు అందించిన భైరాన్ సింగ్ 1987లో రిటైర్ అయ్యారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించింది. ‘భైరాన్ సింగ్ రాథోడ్ అసమాన ధైర్య సాహసాలు, అంకితభావానికి బీఎస్ఎఫ్ నమస్కరిస్తోంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి సరిహద్దు సేవాదళం అండగా ఉంటుంది’ అని అధికారిక ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ‘నాయక్ భైరాన్ సింగ్… మీ ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబసభ్యులకు సంతాపం’ అంటూ హీరో సునీల్ శెట్టి సోషల్మీడియాలో పోస్ట్ పెట్టాడు.
DG BSF & all ranks condole the passing of Naik (Retd) Bhairon Singh, Sena Medal, the hero of #Longewala battle during 1971 War. BSF salutes his intrepid bravery, courage & dedication towards his duty.
Prahari parivar stands by his family in these trying times.#JaiHind pic.twitter.com/nzlqNJUi9K— BSF (@BSF_India) December 19, 2022