బ్రిడ్జ్టౌన్: కరీబియన్ దీవుల్లోని బార్బడోస్ ప్రపంచంలోని కొత్త గణతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. బార్బడోస్ దేశ బాధ్యతల నుంచి రెండవ క్వీన్ ఎలిజబెత్ తప్పుకున్నారు. రాజ్యాధినేత తొలిగింపు కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ పాల్గొన్నారు. దీంతో సోమవారం అర్థరాత్రి నుంచి బార్బడోస్కు విముక్తి లభించింది. దాదాపు 400 ఏళ్ల తర్వాత బ్రిటీష్ పాలన నుంచి బార్బడోస్ స్వేచ్ఛ పొందింది. గవర్నర్ జనరల్గా ఉన్న డామి సాండ్ర మాసన్.. బార్బడోస్ తొలి అధ్యక్షుడయ్యారు. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి డామి సాండ్ర బాధ్యతలు స్వీకరించారు. బార్బడోస్లో 2,85,000 జనాభా ఉంది. 1834 వరకు ఆ దేశం 200 ఏళ్ల పాటు బ్రిటీష్ బానిసత్వంలో మగ్గింది. అయితే 1966లో ఆ దేశం బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. బీచ్లు, క్రికెట్కు బార్బడోస్ ఫేమస్.