బెల్గ్రేడ్: 65 కిలోల కేటగిరీలో రెజ్లర్ భజరంగ్ పూనియా.. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరుగుతున్న ఈవెంట్లో అతను మెడల్ గెలిచాడు. దీంతో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో నాలుగు సార్లు మెడల్స్ గెలిచిన తొలి రెజ్లర్గా అతను నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ గెలిచిన పూనియా.. ప్యూర్టోరికోకు చెందిన ప్రత్యర్తి సెబాస్లియన్ సీ రివెరాపై 11-9 పాయింట్లతో విజయం సాధించాడు. క్వార్టర్స్లో అమెరికా రెజ్లర్ జాన్ మైఖేల్ డయాకోమిహాలిస్ చేతిలో ఓడిన భజరంగ్.. రెపిచేజ్ రౌండ్లో ఆర్మేనియాకు చెందిన వాజెన్ను 7-6 పాయిట్ల తేడాతో ఓడించి బ్రాంచ్ మెడల్ మ్యాచ్కు క్వాలిఫై అయ్యాడు. వరల్డ్ చాంపియన్షిప్లో భజరంగ్ పూనియా బ్రాంచ్ మెడల్ గెలవడం ఇది మూడవసారి. 2013, 2019 సంవత్సరాల్లో అతను కాంస్యం సాధించాడు. 2018లో పూనియా సిల్వర్ మెడల్ గెలిచాడు. ఈసారి జరిగిన వరల్డ్ రెజ్లింగ్ పోటీలకు ఇండియా నుంచి 30 మంది సభ్యులు పోటీపడ్డారు. కానీ మన దేశం కేవలం రెండు మెడల్స్ను మాత్రమే గెలుచుకున్నది. 53 కేజీల విభాగంలో వినేశ్ పోగట్ రెండవ సారి బ్రాంచ్ మెడల్ గెలిచారు.