భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంగళవారం ఓ గర్భిణీకి ఐదు కిలోల బరువుతో బాబు జన్మించాడు. పాల్వంచకు చెందిన శ్రావణి పురిటి నొప్పులతో భద్రాచలంలోని సురక్షా దవాఖానలో చేరింది. డాక్టర్లు పరీక్షించి, శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయగా 5 కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు.
– భద్రాచలం