మారేడ్పల్లి, డిసెంబర్ 15: సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ (చిన్న పిల్లలకు పాలు ఇచ్చే గది)ని బుధవారం పికెట్ డిపొ మేనేజర్ జి.సురేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం సురేష్ మాట్లాడుతూ, బస్సుల్లో ప్రయాణించే చంటి పిల్లల తల్లులు వారి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా జేబీఎస్ ప్రాంగణంలో ఒక గదిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకు ఇన్నర్ వీల్ క్లబ్ సంస్థ ముందుకు రావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు లత, సెక్రటరీ మీన పాల్గొన్నారు.