జమ్ము, సెప్టెంబర్ 26: కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీని స్థాపించారు. దానికి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ ‘రోడ్లు, నీళ్లు, ధరల పెరుగుదల తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మా ప్రాధాన్యం.
అయితే కొంతమంది ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాద్ధాంతం చేస్తున్నారు. దీన్ని పునరుద్ధరించాలంటే పార్లమెంట్లో తగినంత ఎంపీల బలం ఉండాలి. దీన్ని విస్మరించి మేము సాధిస్తాం అని కొందరు అబద్ధాలు చెప్తున్నారు. కానీ నేను అలా చెప్పలేను’ అని పేర్కొన్నారు.