హైదరాబాద్, ఆట ప్రతినిధి: వచ్చే నెలలో జరుగనున్న ఆసియా మహిళల యూత్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే భారత జట్టు కోసం సన్నాహక శిబిరం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 12, 13 తేదీల్లో ట్రయల్స్ నిర్వహించి 27 మంది ప్లేయర్లను శిబిరానికి ఎంపిక చేశామని ఆయన తెలిపారు. కజకిస్థాన్ వేదికగా మార్చి 18 నుంచి 27 వరకు ఆసియా యూత్ టోర్నీ జరుగుతుందని వెల్లడించారు. ఇందుకోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) అనుమతితో త్వరలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తామని జగన్ మీడియాకు వివరించారు. రాష్ట్రం నుంచి కరీనా.. క్యాంప్లో చోటు దక్కించుకుందని అన్నారు. ఈ శిబిరానికి ప్రధాన కోచ్గా మోహిందర్లాల్, కోచ్గా రవికుమార్ నియమితులయ్యారు.