అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో భారత స్పిన్నర్లు దూకుడుమీదున్నారు. రెండవ ఇన్నింగ్స్లో అశ్విన్, అక్షర్ పటేల్.. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేవలం 13 ఓవర్లలోనే ఇంగ్లండ్ తొలి నాలుగు వికెట్లను కోల్పోయింది. అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ కూడా తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే అశ్విన్ రెండు వికెట్లు తీసుకోవడం విశేషం. క్రీజ్లో కెప్టన్ రూట్, ఉన్నాడు. జాక్ క్రాలే, డామ్ సిబ్లే, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 160 రన్స్ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగవ టెస్ట్పైన కూడా పట్టు సాధించింది. ఇన్నింగ్స్ తేడాతోనే విజయాన్ని ఖాతాలో వేసుకునే దిశగా టీమిండియా ముందుకువెళ్తోంది. తాజా సమాచారం అందే వరకు ఇంగ్లండ్ 13 ఓవర్లలో 4 వికెట్లకు 30 రన్స్ చేసింది.