అహ్మదాబాద్ : పంజాబ్లో అధికార పగ్గాలు చేపట్టిన ఆప్ అదే జోష్తో ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమం సందర్శించారు.
ఆప్ నేతలు మహాత్మ గాంధీ ఆశ్రమంలో చరఖా తిప్పారు. రెండు రోజుల పాటు గుజరాత్లో ఆప్ నేతల పర్యటన కొనసాగుతుంది. గుజరాత్లోని మొత్తం 182 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని భిన్నమైన అనుభూతి కలుగుతోందని భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు.
పంజాబ్లో ప్రతి ఇంట్లో చరఖా ఉంటుందని, గాంధీజీతో తమకు అనుబంధం ఉందని అన్నారు. ఈ ఆశ్రమం ఆథ్యాత్మిక ప్రదేశమని, గాంధీజీ స్ఫూర్తి తమలో ఆధ్యాత్మిక భావనలు రేకెత్తిస్తోందని గాంధీ పుట్టిన దేశంలో తాను జన్మించడం గర్వకారణమని కేజ్రీవాల్ ఆశ్రమం విజిటర్స్ బుక్లో రాసుకొచ్చారు.