ఎదులాపురం,మార్చి19 : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏడీసీసీ బ్యాంకు నుంచి ఎలాంటి వోచర్లు లేకుం డా రూ.2.85 కోట్లు తారుమారు చేసిన ప్రధాన నిందితుడు శ్రీపత్కుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆదిలాబాద్లోని పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. బేల ఏడీసీసీ బ్యాంకులో రూ. 2. 85 కోట్లు తారుమారు అయినట్లు ఈ నెల 13న ఏడీసీసీ బ్యాంకు ఆదిలాబాద్ అసి స్టెంట్ జనరల్ మేనేజర్ గడ్డం శ్రీని వాస్ బేల పోలీస్స్టేషన్కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై బ్యాంకు సిబ్బంది విచారణ చేపట్టారు. బేల బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్స్ శ్రీపత్కుమార్ ఆన్లైన్ బె ట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దీంతో డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. డొప్టాల పీఏసీఎస్ బేల, పీఏసీఎస్ సొ సైటీల పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. ఎలాంటి వోచర్స్ లేకుండా బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ల అ నుమతి లేకుండా వారి పా స్వర్డ్ వాడుకొని, ఫేక్ లోన్ అకౌంట్ల ద్వారా అతని కుటుంబ సభ్యులు అయినా భార్య హిమబిందు, మరదలు దివ్య, బావ నారాయణ, అత్త పెంట రాధ అకౌంట్లోకి మొత్తం రూ.2.85 కోట్ల ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత వారి అకౌంట్ల నుంచి సహా ఉద్యోగులు అయినా బండి రమేశ్, ఎస్. ప్రవీణ్, జీ.ప్రవీణ్, రాహుల్, సవిత, ప్రణీ త, వేణుగోపాల్, నితిన్, రమేశ్ అకౌంట్లలోకి రూ.37,97, 419లను నగదు బదిలీ చేశా డు. విచారణలో ఈ విషయం బయటపడడంతో వారి అందరి అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రూ.37,97,419, రూ.60,18,000 రికవరీ చేశారు. సత్యదేవ్ టెక్నాలజీ, పూసం బొటిక్, నేహాలాల్వాని, గోపీచంద్ ఇతర బెట్టింగ్ ఏజెన్సీలలో రూ.1,40,05,106లను పోగొట్టు కున్నాడు. సహా ఉద్యోగి అ యిన బండి రమేశ్ రూ.26.60 లక్షలు, శ్రీపత్ రూ.20 లక్షలు జల్సాల కోసం వాడుకున్నారు. ఆన్లైన్ వ్యసనాల వల్ల జీవితాలకు ఒరిగేదేమీ లేదని, వీటి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడ దని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంక టేశ్వరరావు, జైనథ్ సీఐ కొల నరేశ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే.కృష్ణమూర్తి, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, బేల ఎస్ఐ బీ.కృష్ణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 19 : జిల్లాలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో మట్కా నిర్వాహిస్తున్న ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్కార్వర్ట్లోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్లోని ఇంద్రానగర్కు చెందిన అమూల్వార్ రాజేశ్వర్, ఆడే ప్రమోద్, మహారాష్ట్రకు చెందిన పాండ్రకౌడకు చెందిన గిరిధర్ శర్మ జిల్లాలో ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నారు. డబ్బులను గూగుల్ పే , ఫోన్ పే తదితర వాటిని ఉపయోగించి నగదు బదిలీ చేస్తున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మహారాష్ట్రకు చెందిన గిరధర్శర్మ పరారీలో ఉన్నారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, మట్కా బుక్కులు, రూ.40,200 నగదు , వారి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.2, 6400 నగదు మొత్తం కలిపి రూ.3,04,200 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో మట్కా వ్యాపారాన్ని ఆపివేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలె డీఎస్పీ వెంకటేశ్వరరావు, జైనథ్ సీఐ కొల నరేశ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, బేల ఎస్ఐ బీ కృష్ణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.