బీజింగ్: ప్రతిష్ఠాత్మక బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్.. జెయింట్ స్లాలమ్ ఈవెంట్లో 45వ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పోటీలో ఆరిఫ్ ఓవరాల్గా 2 నిమిషాల 47.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. 62 దేశాలకు చెందిన 89 మంది స్కీయర్లు పాల్గొన్న తొలి రేస్లో ఆరిఫ్ (1:22.35 సెకన్లు) 53వ స్థానంలో నిలిచాడు. వాతావరణం సహకరించకపోవడంతో నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన రెండో రేస్లో భారత స్కీయర్.. 1 నిమిషం 24.89 సెకన్లలో గమ్యస్థానానికి చేరాడు.