అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ షెడ్యూల్ను ఖరారు చేస్తారు.
బడ్జట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాగా, సమావేశాలను ఈనెల 26 వరకు నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే ఏపీ గవర్నర్గా బిశ్వభూషణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.