“అనుభవించు రాజా’ చిత్రంలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. రెండు భిన్న కోణాల్లో సాగే నా పాత్ర ఆసక్తినిరేకెత్తిస్తుంది’ అన్నారు రాజ్తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్నది. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజ్తరుణ్ మాట్లాడుతూ ‘సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగుతూనే అంతర్లీనంగా చక్కటి సందేశాన్నిస్తుంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. ‘ఈ కథ వినగానే రాజ్తరుణ్ గుర్తుకొచ్చాడు. అంతలా తన పాత్రలో ఒదిగిపోయాడు. చిన్న సినిమాకు అన్నపూర్ణ సంస్థ అండగా ఉంటే ఎలాంటి ఫలితాల్ని సాధించవచ్చో ఈ సినిమా బృందం నిరూపించింది’ అని సుప్రియ తెలిపింది. ఈ సినిమా చేయడం ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని దర్శకుడు శ్రీను గవిరెడ్డి చెప్పారు. షూటింగ్ సమయంలోనే సినిమా విజయంపై నమ్మకం ఏర్పడిందని కథానాయిక కశిష్ఖాన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.