అహ్మద్నగర్: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాలనుకున్న ఆమరణ దీక్షను సామాజిక కార్యకర్త అన్నా హజారే నిలిపివేశారు. ఆ రాష్ట్ర మద్యం పాలసీకి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్ష చేయాలనుకున్నారు. అయితే మద్యం విధానాన్ని అమలు చేయడానికి ముందు ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి నుంచి లేఖ అందిందని, దాని వల్ల తన ఆమరణ దీక్షను రద్దు చేస్తున్నట్లు అన్నా హజారా ఇవాళ మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి సూపర్మార్కెట్లు, వాకిన్ స్టోర్లలో మద్యం అమ్మేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.