సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘దర్జా’. పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను నిర్మాత డి సురేష్ బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘యాక్షన్ కథతో సినిమా చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తున్నది. అనసూయ, సునీల్ పాత్రలు బాగున్నాయి. చిత్రబృందానికి శుభాకాంక్షలు అన్నారు’ ఆమని, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ఎంఆర్ వర్మ, సంగీతం : రాప్రాక్ షకీల్, సినిమాటోగ్రఫీ : దర్శన్.