హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజుల పెంపుదల జీవోలను హైకోర్టు రద్దు చేసింది. 2016- 2019 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులను నిర్ణయిస్తూ ఎఫ్ఆర్సీ చేసిన సిఫారసులకు అనుగుణంగానే ఫీజులు వసూలు చేయాలని చెప్పింది. ఎఫ్ఆర్సీ సిఫారసులతో సంబంధం లేకుండా 2017 మే 9న జారీ చేసిన 41, 43 జీవోలకు చట్టబద్ధత లేదని తేల్చింది. ఎఫ్ఆర్సీ 2016 మే 2న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే కాలేజీలు ఫీజులను వసూలు చేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ఎఫ్ఆర్సీ సిఫారసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం 41, 43 జీవోలను జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ఆమోదించింది. ఆ రెండు జీవోలు చెల్లుబాటుకానందున 2016 మే 2న జారీ చేసిన జీవో 29 ప్రకారమే ఫీజులను వసూలు చేయాలని ఆదేశించింది. 2015లో ఎఫ్ఆర్సీ సిఫారసుల మేరకు జారీ అయిన జీవో 29 పేరొన్న ఫీజుల కంటే ఎకువ వసూలు చేసి ఉంటే ఆ మొత్తాలను 30 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఉత్తర్వుల్లో పేరొన్నది.