హుజూరాబాద్ : కార్మికుల ఆత్మగౌరవ బావుటా సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ కే వి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్ అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని రంగాల కార్మికులు కేసీఆర్ వైపే ఉన్నారని.. గెల్లు శ్రీనివావాసుకు సంపూర్ణ మద్దతినిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు వారిని అన్నివిధాలా ఆదుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ కార్మికులకు ద్రోహం చేసిన పార్టీ అని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి కార్మిక సంఘాలు లేకుండా చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే ప్రభుత్వరంగసంస్థలను ప్రైవేటుపరం చేస్తుందని, హుజూరాబాద్లో జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెపల్లి మాధవి, మానుకోట సునీత, రాష్ట్ర కార్యదర్శి ముషం విజయ, నియోజకవర్గ అధ్యక్షుడు మారేపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి దరముల రామ్మూర్తి, నాయకులు పొనగంటి శ్రావణ్కుమార్, నందగిరి మహేందర్రెడ్డి, గోపగోని రమేశ్, రత్నాకర్, సాంబయ్య గౌడ్, బాబయ్య, మంజుల పాల్గొన్నారు.