పాట్నా: 2024 ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించనున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఒక్క బీహార్కు మాత్రమే కాదు, అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వనున్టన్లు ఆయన చెప్పారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన నితీశ్ అక్కడ విపక్ష నేతల్ని కలుసుకున్న విషయం తెలిసిందే.
ఒకవేళ ఏదైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, అప్పుడు కేంద్ర పథకాలకు 90:10 శాతంతో నిధులను కేటాయించడం జరుగుతుంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దీని ద్వారా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంది.
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆయా రాష్ట్రాలకు ఆ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనలను ఆమోదించిన తర్వాత ప్రత్యేక హోదా సిద్ధాంతాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది.