బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా వలన కాస్త తగ్గించిన అక్షయ్ ఈ ఏడాది కమిటైన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. అక్షయ్ నటించిన సూర్య వంశీ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. బెల్ బాటమ్ చిత్రాన్ని మే 28న థియేటర్స్లోకి తీసుకురావాలనే ప్లాన్ చేస్తున్నారు. ఇక పృథ్వీరాజ్ చిత్రాన్ని నవంబర్ 5న, బచ్చన్ పాండే చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయనున్నారు. రీసెంట్గా అతరంగీ రే అనే చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. సారా అలీ ఖాన్ ఇందులో అక్షయ్ సరసన కథానాయికగా నటించింది. మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు సమాచారం.
ఇక నేటి నుండి రామ్ సేతు అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి సంబంధించి షూటింగ్ మొదలు పెట్టాడు అక్షయ్. మార్చి 18న అయోధ్య రామ జన్మభూమిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తమిళనాడులోని రామ్ సేతు నేపథ్యంలో అభిషేక్ శర్మ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇందులో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్గా కనిపించనుండగా, చిత్రంలో ఆయన లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ ఆలోచనలు చేశారు. తాజాగా అక్షయ్ తన సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేయడంతో ఇదే మూవీ లుక్ అయి ఉంటుందని సినీ జనాలు భావిస్తున్నారు.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ బరుచా కథానాయికలుగా నటిస్తున్నారు.