తెలుగు యూనివర్సిటీ, జనవరి 4: తెలుగు సాహిత్యం లో డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు కథ, నవలా రచయితగా, పరిశోధకునిగా, విమర్శకునిగా గొప్ప సేవ చేశారని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిణతవాణి ప్రసంగ కార్యక్రమంలో మంగళవారం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రమాపతిరావు పాల్గొని జీవితం, సాహిత్యం తదితర అంశాలలో చేసిన కృషిపై ప్రసంగించారు. అధ్యక్షోపన్యాసంలో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ రమాపతిరావు తన గురువు అని పేర్కొన్నారు.
తెలుగు సాహిత్యంపై తనకు అభిమానం కలిగించారని అన్నారు. పరిణతవాణి ప్రసంగం చేసిన రమాపతిరావు వివిధ రంగాలలో చేసిన కృషిని వివరించారు. సుమారు 25 జీవిత చరిత్రలు, సాహిత్య రంగంలో ప్రతిభామూర్తులైన వారి పుస్తకాలకు పీఠికలు, పరిచయాలు రాసినట్టు తెలిపారు. 1954లో కందుకూరి వీరేశలింగం పంతులు సమగ్ర సాహిత్యంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వ విద్యాల యం నుంచి డాక్టరేట్ పొందినట్లు వివరించారు. కార్యక్ర మంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు సాహితీవేత్తలు పాల్గొన్నారు.