Akhanda Movie | గత కొంత కాలంగా వరుస ఫ్లాప్లతో సతమతవుతున్న బాలకృష్ణకు ‘అఖండ’ ఫుల్ మీల్స్ పెట్టింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో అఘోరాగ బాలకృష్ణ నటన ప్రశంసనీయం. హిందూ ధర్మాలు, హిందు టెంపుల్స్ గురించి బోయపాటి చెప్పిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై, ఓటీటీలలో కూడా సంచలనాలు సృష్టించింది. ఇటీవలే ఈ చిత్రం రామకృష్ణ థియేటర్లో 175రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక చిత్రం థియేటర్లో 50రోజులు ఆడిందంటే అది గొప్ప విషయం. అలాంటిది అఖండ చిత్రం ఏకంగా 175రోజులు ఆడింది. గుంటూరులోని చిలకలూరిపేటలో ఉన్న రామకృష్ణ థియేటర్లో గత సోమవారంతో 175రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రామకృష్ణ థియేటర్లో తాజాగా సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి, ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ రామారావు నటిస్తే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. జానపదాలు జాలువారాయి, సాంఘీకాలు సామజవరగమనలు అయ్యాయి. పద్యం పదునెక్కింది. పాట నాట్యం నేర్చుకుంది. కళామతల్లి కలకలలాడింది. అలాంటి నటుడు నందమూరి తారక రామారావు అంటూ బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ అఖండ చిత్రాన్ని ఆయనకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
‘అఖండ’లో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటించింది. హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా పూర్ణ కీలకపాత్రలో నటించింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేనితో ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు.
#Balayuababu garu and #Boyapati garu at Ramakrishna theatre, Chilakaluripeta today on the occasion of #Akhanda Silver Jubilee celebrations.💥💥#NandamuriBalakrishna Boyapati Srinu pic.twitter.com/vgQOMaw6Ay
— Worldwide Mokshu Fans (@mokshu_fans) May 29, 2022