జైపూర్: రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో ఖాదింగా చేస్తున్న సల్మాన్ చిస్తీని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మ్ తల నరికి తెస్తే వాళ్లకు తన ఇల్లు ఇస్తానని ఖాదిం సల్మాన్ చిస్తీ ఓ వీడయోలో పేర్కొన్నారు. ఆ వీడియో ఆధారంగా సోమవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని ఇవాళ రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని ముస్లిం దేశాలకు సమాధానం ఇవ్వాలని, తాను అజ్మీర్ నుంచి మాట్లాడుతున్నానని, ఇది హుజూర్ ఖ్వాజా బాబా కా దర్బార్ నుంచి వచ్చిన సందేశమని తన వీడియోలో సల్మాన్ చిస్తీ తెలిపారు. దర్గా బాబా సల్మాన్కు క్రిమినల్ రికార్డు ఉన్నట్లు పోలీసు ఆఫీసర్ దల్వీర్ సింగ్ ఫౌజ్దార్ తెలిపారు. అజ్మీర్ దర్గా ఆఫీసు దీవాన్ ఆ వీడయోను ఖండించారు. దర్గా మతసామరస్యానికి ప్రతీక అన్నారు. ఖాదిం సల్మాన్ తన వీడియోలో వెల్లడించిన అభిప్రాయాలు దర్గా సందేశంగా భావించరాదన్నారు. ఇప్పటికే ఉదయ్పూర్ హత్యతో రాజస్థాన్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.