సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ధనుష్ భార్య దర్శకురాలిగా సినీ పరిశ్రమలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘3’తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా డబ్ అయ్యింది. ఆ తర్వాత ‘వెయ్ రాజా వెయ్’ మూవీ చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమాను తెలుగులో చేయడానికి ఐశ్వర్య ఆర్. ధనుష్ సిద్ధమవుతున్నారు.
భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఐశర్వ సినిమా చేయబోతుంది. ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమాగా రూపొందనుండగా, ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో మూవీ డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నాం అని ఆయన అన్నారు.