వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణం లో ఏజీహబ్-అగ్రిఇన్నోవేషన్, రాష్ట్రమంత్రులు ఐటీ శాఖ కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ హబ్ని సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.39 నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. వీసీ కార్యాలయం సమీపంలో 10 వేల చదరపుఅడుగుల విస్తీరణంలో అగ్రిహబ్ నిర్మించారు. సాంకేతిక , 21స్టార్టఫ్లను గుర్తించిన ఐటీ శాఖ, ఆర్టిఫిషీయల్ ఇంటలీజెన్స్, రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం, తదితర సమాచారం అందుబాటులో ఉంచింది.
శాస్త్రవేత్తలకు గ్రామీణ యువత, మహిళలు, రైతులు , రైతు ఉత్పత్తి దారుల సంఘాలలో అగ్రి బిజినెస్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ హబ్ ఓగ్రంథాలయంగా ఉపయోగ పడుతుందన్నారు. రైతులకు ఆదాయం రెట్టింపు చేయడానికి అందరు కృషిచేయాలని ఆయన తెలిపారు .రీసెర్చ్ , టెక్నాలజీలు కలిస్తే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు .ప్రస్తుత పరిస్థితులలో ఆహారపు అలవాట్లు బాగా మారాయని అందుకు అనుగుణంగా కొత్త వెరైటీలు తీసుకు రావాలని తెలిపారు. సమీకృత వ్యవసాయం పద్దతులపై వర్సిటీలు పనిచేయాలన్నారు. స్టార్టప్లు చాలా అవసరమన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ , డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు విస్త్రతంగా కావాలన్నారు.
ఉపకులపతి ప్రవీణ్రావు నేత్రృత్యం లో వర్సిటీ అద్బుతంగా పనిచేస్తుందని మంత్రి అభినందించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదగా వేరు శనగ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశోధనల కోసమే వర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చామన్నారు. ఆయిల్ ఫామ్ సాగుని పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. అదేవిదంగా నూనెగింజల ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయ పడ్డారు. పరిశ్రమ ప్రతినిధులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అద్యాపకులు , విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అగ్రిహబ్ ఎండీ డా. కల్పనాశాస్త్రి పాల్గొని పలు సూచనలు చేశారు. నూతన టెక్నాలజీ తో నాణ్యత గల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు ,పురుగు మందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ హబ్ ద్వారా ఫాలో అయిన రైతుకు పెట్టుబడులు ఘననీయంగా తగ్గి, పంటలో నాణ్యత పెరుగ నుంది. ఈ పంట నుంచే అధిక దిగుబడులు పెరిగి దేశ రైతాంగం తెలంగాణ వైపు చూసే అవకాశాలున్నాయి.