భువనేశ్వర్: ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే ‘అగ్ని-5’ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో బుధవారం విజయవంతంగా పరీక్షించారు. త్రీ-స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్ కలిగిన ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఎంతో కచ్చితత్వంతో నాశనం చేయగలదు. అగ్ని-5ను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్లో ఇప్పటికే నాలుగు క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. తాజా క్షిపణి ఐదవది. 2012లో తొలిసారిగా పరీక్షించిన అగ్ని-1 క్షిపణి.. 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని-2.. 2,000 కిలోమీటర్లు, అగ్ని-3.. 2,500 కిలోమీటర్లు, అగ్ని-4.. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.