హైదరాబాద్ : న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో(Test match) తొలి ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో ఆప్గనిస్తాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంగేట్రం మ్యాచ్లోనే మానవ్ సుతార్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఆప్గాన్ 152 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రహ్మత్ షా(60) ఒక్కడే రాణించాడు. ప్రసిద్ధ్ క్రిష్ణ 3వికెట్లు తీసుకోగా వాషింగ్టన్ సుందన్ ఒక వికెట్ తీశాడు. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆప్గాన్ను ఇండియా ఫాల్ఆన్కు ఆహ్వానించింది. 412 పరుగుల లోటుతో సెకండ్ ఇన్సింగ్స్ ఆరంభించిన ఆ జట్టు 4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 18 పరుగులు చేసింది.
కాగా, న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో(Test match) శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్(100), సెంచరీలు సాధించగామూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్(52) అర్ద శతకాలతో ఆకట్టుకున్నారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో చెలరేగాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలొక వికెట్ పడగొట్టారు. కాగా, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై లభించిన అవకాశాన్ని యశస్వి జైస్వాల్సద్వినియోగం చేసుకోలేకపోయాడు.సఫీ బౌలింగ్లో (24) పరుగులకే వెనుదిరిగాడు.