న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంగవరం నౌకాశ్రయం ఆదానీ గ్రూప్ పరం కానున్నది. గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లుమంగళవారం ప్రకటించింది. ఈ పోర్టులో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి గల 58.1 శాతం వాటా కొనుగోలు చేయడానికి రూ.3,604 కోట్ల ఒప్పందం కుదిరిందని పేర్కొంది.
విండీ లేక్సైడ్ నుంచి 31.5% వాటా కొనుగోలుకు ఒప్పందం
ఇప్పటికే గంగవరం పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాలను రూ.1,954 కోట్ల విలువకు వార్బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థ అనుబంధ విండీ లేక్సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో గంగవరం పోర్టు కంపెనీలో అదానీ గ్రూప్ అనుబంధ అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ వాటా 89.6 శాతానికి చేరుతుంది.
ఏ సీజన్లోనైనా సరకు రవాణా గంగవరం పోర్ట్కే సాధ్యం
విశాఖపట్నానికి సమీపాన గల గంగవరం నౌకాశ్రయం ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద నాన్-మేజర్ పోర్టు. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లోనైనా సరకు రవాణా చేయగల అవకాశం ఈ పోర్టుకు ఉంది. బాగా లోతైన పోర్టు కావటంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్ కేప్ సైజ్ ఓడలూ కూడా ఇక్కడికి వచ్చి వెళ్లగలవు.
తొమ్మిది బెర్త్ల పోర్ట్ ఇది
దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణం గల గంగవరం పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి. ఇక్కడ నుంచి బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు/ దిగుమతులు పెద్దఎత్తున సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా జరుగుతున్నది.
డీవీఎస్ రాజు కుటుంబానికి 58.1% షేర్
గంగవరం పోర్టు కంపెనీలో 51.70 కోట్ల షేర్లు ఉన్నాయి. వాటిలో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.4 శాతం కాగా, వార్బర్గ్ పింకస్ చేతిలో 31.5 శాతం వాటా ఉంది. వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, ఆయన కుటుంబ వాటాలను అదానీ గ్రూపు కొనుగోలు చేస్తున్నది. దీంతో ఈ పోర్టు కంపెనీలో 89.6 శాతం వాటా అదానీ పరమైంది. ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం నౌకాశ్రయాన్ని అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!