కోల్కతా: వికెట్ కీపర్ కుషాగ్ర కుమార్ (266; 37 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో నాగాలాండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్రిక్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్ కొండంత స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 769 పరుగులు చేసింది. పదిహేడేండ్ల కుషాగ్ర కుమార్ ద్విశతకంతో అదరగొడితే.. టీమ్ఇండియా ప్లేయర్ షాబాజ్ నదీమ్ (123 నాటౌట్; 14 ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ సింగ్ (107; 13 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి, ఖ్రివిత్సో చెరో మూడు వికెట్లు పడగొట్టారు.