ప్రముఖ భరతనాట్య కళాకారిణి మధురిమ చిత్రరంగంలోకి పునఃప్రవేశం చేస్త్తు న్నారు. గతంలో ‘ఒరేయ్ రిక్షా’ చిత్రంలో ఆర్ నారాయణమూర్తి సోదరి పాత్రలో నటించిన ఈ నటి..ఇటీవల ‘శతమానం భవతి’ చిత్రంతో తిరిగి చిత్ర పరిశ్రమకు వచ్చారు. తాజాగా సమంత నటిస్తున్న ‘యశోద’ చిత్రంతో పాటు రాజ్తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధురిమ మాట్లాడుతూ..‘భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. ఆ కళను దేశవిదేశాల్లో ప్రదర్శించాను. అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా. మళ్లీ ఇప్పుడు తెలుగు తెరకు రావడం సంతోషంగా ఉంది. ‘యశోద’, ‘స్టాండప్ రాహుల్’తో పాటు మరికొన్ని మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. నటిగా కొనసాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు.