న్యూఢిల్లీ, జనవరి 10: ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్పై నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై సైనా ఈనెల 5న ట్విట్టర్లో స్పందిస్తూ ‘ప్రధాని భద్రతలో రాజీపడిన పరిస్థితి ఎదురైతే, ఏ దేశమైనా సురక్షితంగా ఉంటుందని ఎలా అనుకోగలం’ అని అన్నారు. దీన్ని సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ.. ‘చిన్న కాక్ ప్రపంచ విజేతా.. దేవుని దయ వల్ల దేశాన్ని కాపాడేవారు ఉన్నారు’ అని పేర్కొన్నారు. సిద్దార్థ్ ట్వీట్పై సైనా తాజాగా స్పందించారు. ఇది సరైనది కాదని, ఆయన తన అభిప్రాయాన్ని ఇంతకంటే మంచి పదాలతో వ్యక్తపరచవచ్చునని పేర్కొన్నారు. కాగా, వివాదంపై సిద్దార్ధ్ సోమవారం వివరణ ఇచ్చారు. తనకు ఎవరినీ అవమానపరిచే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకున్నారని అన్నారు.