న్యూఢిల్లీ: సుమారు 200 కోట్ల బెదిరింపు కేసులో.. బాలీవుడ్ నటి నోరా ఫతేహ్ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. ఈ కేసుతో లింకున్న కాన్మాన్ సురేశ్ చంద్రశేఖర్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల శాఖ నోరా ఫతేహ్ను ఓ కేసులో సాక్షిగా విచారించారు.ఇదే కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ను పోలీసులు గతంలో విచారించారు. అయితే నోరా ఫతేహ్తో పాటు ఇతర సెలబ్రిటీలు సుకేశ్ నుంచి ఖరీదైన గిఫ్ట్లు తీసుకున్నట్లు ఫెర్నాండేజ్ ఆరోపించింది. మనీల్యాండరింగ్ కేసులో సుకేశ్, నోరా ఫతేహ్ను గతంలో ఈడీ ప్రశ్నించింది. నోరా ఫతేహ్కు బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్గా ఇచ్చినట్లు సుకేశ్ గతంలో తెలిపాడు. దీనిపై ఫతేహ్ స్పందిస్తూ ఆ కారును తన ఫ్రెండ్ బాబీ ఖాన్కు ఇచ్చినట్లు చెప్పుకువచ్చింది. ర్యాన్బాక్సీ కంపెనీ ప్రమోటర్ల నుంచి 215 కోట్లను బెదిరించి వసూల్ చేసినట్లు సుకేశ్పై ఆరోపణలు ఉన్నాయి.