హైదరాబాద్ , మే 26:కమ్యూనిటీల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సంగారెడ్డిలో ఉన్న ఏబీ ఇన్బెవ్ ఇండియా క్రౌన్ అండ్ చార్మినార్ బ్రూవరీస్ కోవిడ్-19తో ప్రభావితమైన చుట్టు పక్కల కమ్యూనిటీలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించడం ద్వారా మద్దతునందించేందుకు ప్రతిజ్ఞ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలకు (మల్లేపల్లి, గుంటపల్లి, గోపులారం, తెర్పోల్, గొల్లపల్లి, శివంపేట, చక్రియాల్, చోట్కూర్, ఫసల్వాడీ, లింగంపల్లి, వెండికోల్) చెందిన 2000 కుటుంబాలకు 15 కేజీల రేషన్ కిట్స్ను అందించారు. వీటిలో నాణ్యమైన బియ్యం, గోధుమ పిండి, నూనె, మసాలాలు, విభిన్న రకాల పప్పు దినుసులు, ఉప్పు, పంచదారతో పాటుగా శానిటైజర్లు, సబ్బులు ఉన్నాయి.
ఏబీ ఇన్బెవ్ ఇండియా ఇప్పుడు స్థానిక అధికారులు ,వైద్య అధికారులతో అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి వద్ద ప్రభావితమైన కమ్యూనిటీలకు మద్దతునందిస్తున్నారు. ఈ నెలారంభంలో, ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్ 300కు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 8వేలకు పైగా అవసరమైన సహాయాన్ని అందించే కిట్స్ను కోవిడ్-19 ప్రభావిత కుటుంబాలకు అందించడంతో పాటుగా దేశ వ్యాప్తంగా 50కు పైగా గ్రామాలలో ఐదు లక్షల మాస్క్లు, 5వేలకు పైగా టెస్ట్ కిట్స్ను సైతం అందించింది.
‘‘సంక్షోభ సమయంలో అవసరమైన సంఘీభావం అందించడంలోనూ మాకు ఘనమైన చరిత్ర ఉంది. మా కమ్యూనిటీలు, ప్రజల ఆరోగ్యం, భద్రత మాకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యతగా ఉంటూనే ఉంటుంది. సమాజం నుంచి తమ వ్యాపారం వేరు కాదని మేము అర్థం చేసుకున్నాం. కమ్యూనిటీలు, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులకు మా నిరంతర మద్దతు కొనసాగించడం ద్వారా కోవిడ్–19తో జరుగుతున్న ఈ యుద్ధంలో విజయవంతమవుతామనే నమ్మకంతో ఉన్నాం. కలిసికట్టుగా మనం ఏదైనా సాధించగలం’’ అని ఏబీ ఇన్బెవ్ కార్పోరేట్ ఎఫైర్స్ –సౌత్ ఆసియా, వైస్ ప్రెసిడెంట్ అనసూయ రే” అన్నారు.