ముషీరాబాద్, నవంబర్ 10: నిఘంటు రూపకర్త సీపీ బ్రౌన్ జయంతిని బుధవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో నిర్వహించారు. తెలంగాణ సమాచార ముఖ్య కమిషనర్ బుద్దా మురళి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రౌన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తండ్రినే గురువుగా చేసుకొని 14 ఏండ్ల ప్రాయంలోనే మూడు భాషల్లో పట్టు సాధించిన గొప్ప వ్యక్తి బ్రౌన్ అని కొనియాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొత్తూరి సుబ్బారావు, సీనియర్ పాత్రికేయులు దేవసేన, బ్రాహ్మణ ఐక్యవేదిక కార్యదర్శి భమిడి ఉష, తదితరులు పాల్గొన్నారు.