న్యూఢిల్లీ, మే 11: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్..హైదరాబాద్తోపాటు బెంగళూరులలో ఉన్న టెక్నాలజీ సెంటర్లకోసం 500 మంది టెక్నాలజీ నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రెండు సెంటర్లలో 1,000 మంది టెక్కీలు పనిచేస్తుండగా, ఈ డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 1,500కి పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
భారత్లో భవిష్యత్తులోనూ క్యాబ్ సేవలు అందించేదానిపై తమ కమిట్మెంట్కు ఈ ఉద్యోగాల నియామకం నిదర్శణమని, దేశీయంగా ప్రతిభ కలిగిని టెక్నాలజీ నిపుణులను గుర్తించే పనిలో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.