న్యూఢిల్లీ: బస్టాండ్లో ఓ మంచినీటి బాటిల్ను ఎంత పెట్టి కొంటారు? మహా అయితే రూ.30 కదా. అయితే ఓ మంచినీటి బాటిల్ ధర రూ.45 లక్షలు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ‘అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని’ అనే 750 మిల్లీ లీటర్ల ఈ మంచినీటి బాటిల్ ధర అక్షరాలా రూ.45 లక్షలు. ఇది ఎందుకు అంత ఖరీదు అనుకుంటున్నారా? ఫ్రాన్స్, ఫిజీలోని సహజ నీటిబుగ్గల నుంచి స్వచ్ఛమైన నీటిని సేకరించి ఈ బాటిల్లో నింపుతారు. దీని లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేశారు. ఈ నీళ్లు కూడా ప్రత్యేక రుచిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగానూ మేలు చేస్తాయట.