హైదరాబాద్: అగ్రి స్టార్టప్ సేవల సంస్థ అవర్ ఫుడ్..తాజాగా రూ.45 కోట్ల నిధులను సమీకరించింది. పరిశోధన, చిన్న స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సరఫరా వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కంపెనీకి చెందిన ఆహార పదార్థాలు తెలంగాణతోపాటు, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ర్టాలలో లభించనున్నాయి.