శ్రీనగర్: అమర్నాథ్ క్షేత్రం వద్ద శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదల్లో సుమారు 15 మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే వరదల్లో సుమారు 40 మంది వరకు కొట్టుకుపోయి ఉంటారని, వారి సమాచారం ఇంకా తెలియలేదని ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే తెలిపారు. అమర్నాథ్ గుహ వద్ద ప్రస్తుతం వెదర్ క్లియర్గా ఉందన్నారు. గాయపడ్డవారిని హెలికాప్టర్ల ద్వారా బేస్ క్యాంప్కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కాలినడక యాత్రను నిలిపివేశామని, ఎవరు కూడా ముందుకు కదలవద్దు అని హెచ్చరించినట్లు పీఆర్వో వివేక్ తెలిపారు.
అమర్నాథ్ ప్రాంతంలో కుంభవృష్టి వల్ల అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. నార్తర్న్ రూట్లో భక్తుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తమ వద్ద పది మంది ఉన్నారని, అందులో ఇద్దరి తలకు గాయాలయ్యాయని, మరో ముగ్గురికి హైపోథర్మియా ఉన్నట్లు నోడల్ మెడికల్ ఆఫీసర్ మేజర్ పంకజ్ కుమార్ తెలిపారు.
గాయపడ్డవారిని తరలించేందుకు బీఎస్ఎఫ్ ఎంఐ 17 చాపర్ను రంగంలోకి దించారు. బల్తాల్లోని నీల్గ్రాహ్ హెలిప్యాడ్ నుంచి మృతదేహాలను శ్రీనగరలోని బీఎస్ఎఫ్ క్యాంప్కు తరలిస్తున్నారు. వాస్తవానికి వాతావరణం సరిగా లేని కారణంగా ఎంఐ 17 హెలికాప్టర్లను కాసేపు ఆపేశారు.